భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజం నిర్మించడం కోసం...... ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో భాగస్వాములు కండి

 భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజం నిర్మించడం కోసం......

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో భాగస్వాములు కండి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలో స్థానిక జిల్లా కార్యాలయం నందు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యవర్గ సమావేశము స్థానిక జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లాలోనీ ఏడు మండలాల నుండి 25 మంది మండల సభ్యులు హాజరయ్యి 2024-25 సంవత్సరాల వరకు పనిచేయు నూతన నంద్యాలజిల్లా మరియు మండల కమిటీలను సభ్యులందరి ఏకాభిప్రాయంతో ఎన్నుకోవడం జరిగిందని, డిసెంబర్ చివరి నాటికి పూర్తిస్థాయిలో మండల మరియు జిల్లా కమిటీ  ఏర్పాటు చేసుకునే విధంగా కార్యాచరణను రూపొందించుకోవడం జరిగిందని,ఐక్యవేదిక ముఖ్య లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ  రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకునే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగంగా ఐక్యవేదిక నాలుగు ప్రధాన అంశాలను ఆయుధాలుగా తీసుకుని భారత రాజ్యాంగము కనీస అవగాహన,సమాచార హక్కుచట్టం,గ్రామసభలు మరియు వార్డుసభలు, ఎన్నికల విధాన సంస్కరణల అంశాల పై ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చి,భవిష్యత్తు తరాలకు మెరుగైన,ఉత్తమ సమాజాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నదనీ,


 
సమాజ అభ్యున్నతి కోరుకునే నంద్యాల జిల్లా పౌరులు మా ఐక్యవేదిక ఉద్యమంలో పాల్గొని మెరుగైన సమాజ స్థాపనలో పాలు పంచుకోవాలని పిలుపు ఇచ్చారు.ఈకార్యక్రమంలో నంద్యాలజిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం,ప్రధాన కార్యదర్శి డిపి మస్తాన్ వలి,కోశాధికారి సత్యనారాయణ,మహిళా విభాగం కన్వీనర్ చిలక ప్రసన్న కుమారి,సహాయ కార్యదర్శి చిన్న నాగన్న, బండి ఆత్మకూరు మండల అధ్యక్షులు రామరాజు, నంద్యాల రూరల్ సభ్యులు ఆరిఫ్ ఉద్దీన్,నంద్యాల టౌన్ కార్యదర్శి శివశంకర్, ఆత్మకూరు మండల బాధ్యులుసాయి దత్త, మహానంది మండల బాధ్యులురాయుడు, కొత్తపల్లిమండల సభ్యులు ప్రసాదు  తదితర ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: