పాణ్యం రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్ల ను ఆపాలనీ విజ్ఞప్తి చేసిన.... పాణ్యం ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి

పాణ్యం రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్ల ను ఆపాలనీ విజ్ఞప్తి చేసిన.... 

పాణ్యం ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని స్థానిక పాణ్యం రైల్వే స్టేషన్ లో దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మనీష్ అగర్వాల్ తనిఖీలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పాణ్యం శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని పాణ్యం,నెరవాడ,కౌలూరు గ్రామాల్లో నెలకొన్న రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యలను, పాణ్యం రైల్వే స్టేషన్ మీదుగా 8:30 కి నడుస్తున్న అమరావతి ఎక్స్ ప్రెస్, హుబ్లీ-విజయవాడ, గుంటూరు-కాచిగూడ,  కాచిగూడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ రైళ్ళను ఆపాలని, పాణ్యం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు,పర్యాటక ప్రదేశాలు,సోలార్ పరిశ్రమలు ఉన్నాయనీ, పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వచ్చిన పర్యాటకులకు మరియు అనునిత్యం వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం ప్రయాణించే ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలవకుండా,ఇతర రాష్ట్రాల నుంచి పుణ్యక్షేత్రాలకు వచ్చి మోక్కుబడులు తీర్చుకునే భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారనీ,


పాణ్యం రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ను తక్షణమే ఏర్పాటు చేసి, పాణ్యం రైల్వే స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలబడేలా చర్యలు తీసుకొని ప్రజల అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం ను పాణ్యం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేసిన విన్నపానికి దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం మనీష్ అగర్వాల్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకొని ఎక్స్ ప్రెస్ రైళ్లు పాణ్యం రైల్వే స్టేషన్ లో  నిలబడేలా చర్యలు తీసుకుంటామనితెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు సూర్యనారాయణ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మార్నింగ్ వైఎస్ఆర్సిపి నాయకులు మరియు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: