జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీలో,,,,
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కార్తీక్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
విజయదశమి పర్వదినము సందర్భంగా సోమవారంనాడు జల్ పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జల్పల్లి మున్సిపాలిటీ బిసి సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ విజయదశమి రోజున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉదన్నారు.
విజయదశమి రోజు ఏ పని చేసిన విజయం సాధిస్తామని, రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి భారీ మెజారిటీ తో ఘన విజయం సాధిస్తారని కార్తీక్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు జల్ పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ కాలనీకి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి రాకను స్వాగతిస్తూ స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు బానసంచాతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: