న్యాయానికి సంకెళ్లు అంటూ నిరసన తెలిపిన..... గడివేముల మండల టిడిపినాయకులు

 న్యాయానికి సంకెళ్లు అంటూ నిరసన తెలిపిన.....

గడివేముల మండల టిడిపినాయకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ వర్గం గడివేముల మండల పరిధిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినాయకుల పిలుపు మేరకు"న్యాయానికి సంకెళ్లు"కార్యక్రమం లో భాగంగా పాణ్యo మాజీ శాసనసభ్యురాలు మరియు టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆదేశాల మేరకు గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గడివేముల మండలంలోని టీడీపీ నాయకులు,ఐటీడీపీ సభ్యులు,కార్యకర్తలు మరియు అభిమానులతో కలిసి "న్యాయానికి సంకెళ్లు" అనే నినాదంతో చేతులకు నల్ల రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని, ఫ్లకార్డులు చేతబూని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మేము సైతం అండగా ఉన్నామని మద్దతుగా నినాదాలు చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి గడివేముల గ్రామ టిడిపి నాయకులు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి,నాగిరెడ్డి, ముస్లిం నాయకులు షాలుబాషా,


ఎస్సీ నాయకులు చిట్టిబాబు, దానం,బిలకలగూడూరు గ్రామంలో ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఫరూక్,బూజునూరు గ్రామంలో రామచంద్రారెడ్డి, దుర్వేసి గ్రామంలో కృష్ణ యాదవ్, కే.బొల్లవరం గ్రామంలో సోషల్ మీడియా ప్రతినిధి సుభద్రమ్మ,పెసర వాయి గ్రామంలో ఒడ్డు లక్ష్మీదేవి, చిందుకూరు గ్రామంలో అనసూయమ్మ, మంచాలకట్ట గ్రామంలో శ్రీనివాసరెడ్డి, ఉందుట్ల గ్రామంలో గంగాధర్ రెడ్డి, కరిమద్దెల గ్రామంలో ఈశ్వర్ రెడ్డి,తిరుపాడు గ్రామంలో గిరిబాబు, ఐటీడీపీ సభ్యులు రాజు, బాబునాయక్ గ్రామాలలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: