పసుపుబోర్డు ప్రకటించినందుకు
బీజేపీ ఆధ్వర్యంలో మోడీకి పాలాభిషేకం
బీజేపీనేత ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో పసుపు సంబరాలు
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ పసుపుబోర్డును ప్రకటిచిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో బహదూర్ పుర అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి. ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పసుపు సంబరాలు చేసుకొన్నారు. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ నేతలు పసుపు సంబరాలు చేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోడీకి ఈ సందర్బంగా ఆనంద్ గుప్తా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎన్. ప్రశాంత్, ధర్మతెజ, నరేష్, నిరంజన్ కుమార్, బిట్టు, సుమింత్, ప్రమోద్ తోపాటు బహదూర్ పుర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: