గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన ఎంతో అవసరం,,, మోనోపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో వైద్య నిపుణులు

గర్భసంచి ప్రాధాన్యత పై అవగాహన ఎంతో అవసరం

మోనోపాజల్  సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవంలో వైద్య నిపుణులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

మహిళల ఆరోగ్య పరిరక్షణ లో గర్భసంచి ప్రాధాన్యత పై విస్తృత స్థాయిలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పలువురు వైద్య నిపుణులు సూచించారు. ప్రధానంగా మునోపాస్ దశలో మహిళల  మానసిక శారీరక సమస్యలు పరిస్థితులు గర్భసంచి ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.   తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో బుధవారం  సాయంత్రం జాతీయస్థాయిలో ఆయుర్వేదిక్ మనోపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఏ ఎం ఎస్ ఐ)  ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  కిమ్స్ మహిళా రోగుల వైద్య విభాగం అధిపతి డాక్టర్ త్రిపుర సుందరి మల్లారెడ్డి వైద్య కళాశాల  స్త్రీలుగా వైద్య విభాగం అధిపతి  డా.హరి అనుపమ, కశ్యపి ఆయుర్వేద ప్రసూతి ఫౌండేషన్ చైర్మన్.. ప్రొఫెసర్ డాక్టర్ చిలువేరు రవీందర్ లు  ఈ సందర్భంగా మెనోపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ అవగాహన లోపంతో సంతానోత్పత్తి అనంతరం మహిళలకు గర్భసంచిని తొలగించే విధానం సహేతుకం కాదన్నారు. ఉత్పత్తి అనంతరం మహిళల ఆరోగ్య పరిరక్షణలో గర్భసంచి ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు వివరించారు.


గ్రామీణ ప్రాంతాల్లో మధ్య వయసు తర్వాత గర్భసంచి తొలగించేటువంటి విధానంతో అనేక శారీరక మానసిక సమస్యలు ఉత్పన్నమైనట్టు ఒక అధ్యాయంలో స్పష్టమైందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. మనోపాసులు దశలో గర్భసంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ కే అర్. ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ గణేశ్వర్ రెడ్డి .. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నీలిమ ఆర్య లతోపాటు పలువురు వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    ఈ కార్యక్రమానికి మెనుపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ సునీత గోను అధ్యక్షత వహించారు. సౌజన్ చైర్మన్ డాక్టర్ కోల విజయ కుమారి ..డాక్టర్ బి.ఆర్ కేఆర్ వైద్య కళాశాల స్త్రీ రోగ  వైద్య విభాగం అధిపతి డాక్టర్ సునీత జోషి . డాక్టర్ నాగలక్ష్మి డాక్టర్ లక్ష్మి.అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ యామిని సౌభాగ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా వైద్య నిపుణులు ఈ కార్యక్రమంలో ప్రతినిధులుగా పాల్గొన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: