హనీఫ్ అలీ మనమధ్య లేకపోవడం బాధాకరం
షేక్. ఖలీఫా తుల్లా బాషా
(జానో జాగోగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ సభ్యులు బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ నాయకులు హనీఫ్ అలీ మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం అని మంచి సోదరుడిని కోల్పోయమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ & బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మర్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు షేక్. ఖలీఫా తుల్లా బాషా విచారం వ్యక్తపరిచారు. హైదరాబాద్ లోని ఆయన నివాసముకు వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామశించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ఆయన లోటు ఎవ్వరు తీర్చలేనది అని అయితే మీకు నావంతూ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ధైర్యం ఇచ్చారు.
దివంగత హనీఫ్ అలీ
బీజేపీ పార్టీ మైనారిటీ వర్గాలల్లో బలపడటానికి ఆయన చేసిన కృషి మరువలేనిది అన్నారు. షేక్. ఖలీఫాతుల్లా బాషా వెంటా బీజేపీ మైనారిటీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ గజనీ , హైదరాబాద్ సిటీ బీజేపీ మైనారిటీ మోర్చా అధికార ప్రతినిధి బేగం, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అలుగునురి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Post A Comment:
0 comments: