టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని కోరుతూ.... 

బిఎస్పి పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

టీఎస్పీఎస్సీ బోర్డు ను రద్దు చేయాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ నాయకులు సోమవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. బిఎస్పి నాయకులు నినాదాలు చేస్తూ అలజడి సృష్టించారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.  అరెస్టు అయిన వారిలో జిల్లా ఇన్ చార్జీ  ఎ.అంజయ్య, జిల్లా అధ్యక్షులు చాట్ల చిరంజీవి, ఆర్.సునీల్, పి.శైలజ, ఏ.నాగరాజు,  చార్మినార్ అద్యక్షులు రామ్ చరణ్ దాస్, రమేష్, ప్రసన్న యాదవ్ తదితరులు ఉన్నారు.









 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: