మనదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత అందరిపైఉంది

అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనీస పాష   

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని స్థానిక పాణ్యం లోని ఏపీ మాడల్ స్కూల్ మరియు కస్తూరిబా పాఠశాలల యందు మొక్కలు నాటే కార్యక్రమంను మరియు బాలికలతో ముఖాముఖి కార్యక్రమంను అంతర్జాతీయ మానవహక్కుల కమిషన్ రాష్ట్రమహిళా అధ్యక్షురాలు అనీస పాష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతగా ఉంటూ,బాగా చదువుకోని సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని సొంతం చేసుకొని సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరించాలని అనీస పాష సూచించారు. పిల్లలు పాశ్చాత్యసంస్కృతిని అలవాటు చేసుకోని, మన దేశ సంస్కృతిని మర్చిపోతున్నారని, మన దేశ ఉనికి చాలా గొప్పదని, మన కట్టు, బొట్టు వలన మన భారతదేశప్రత్యేకతను అన్నిదేశాలు ఇష్టపడుతున్నాయని,


మనం మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనంతరం విద్యార్దులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బాలికలు తమ హక్కుల కోసం పోరాడినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందనితెలిపారు. ఈకార్యక్రమంలో అంతర్జాతీయ  మానవహక్కుల కమిషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు కళ్యాణీ, మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దినేష్ బాబు, కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపాల్ లలిత మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: