టిడిపి అధినేత అక్రమ అరెస్టు రిమాండ్ కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే 

పాణ్యం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

టీడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా "బాబుతో నేను-మేము సైతం" అంటూ నంద్యాల జిల్లా పాణ్యo నియోజకవర్గo పాణ్యo మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం ఆవరణలో పాణ్యo మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సామూహిక నిరాహార దీక్షలకు భారీ సంఖ్యలో మహిళలు స్వచ్చందంగా తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు.


ఈ సందర్భంగా పాణ్యం టిడిపి ఇన్చార్జ్ గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల దుర్వినియోగం కాలేదని, స్కిల్ డెవలప్మెంట్  అధికారులు చెబుతుంటే, మరొక పక్క వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగంఅయ్యాయని అందుకు బాధ్యుడు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును దురుద్దేశపూర్వకంగా అక్రమంగా కేసులో ఇరికించి రిమాండ్ పంపారని, నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు నాయుడుకి ఎలాంటి సంబంధం లేదని "బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమం ద్వారా ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ టిడిపి అధినేత ప్రజలలో చైతన్య భావాన్ని పెంచి దూసుకెళ్తున్నారని,  యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇది చూసి వైసిపి ప్రభుత్వం ఓర్వలేకనే కక్ష సాధింపులో భాగంగా అక్రమంగా, అన్యాయంగా కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తంచేశారు.


ఈకార్యక్రమంలో నంద్యాల జిల్లా పార్లమెంట్అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, నంద్యాల పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి నారాయణమ్మ, ఎంపిటిసి రంగ రమేష్, మండల నాయకులు రమణమూర్తి, లాయర్బాబు, సుధాకర్, ఖాదర్బాషా, ఇర్ఫాన్, సురేంద్ర, తిరుపాల్నాయక్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు దానం, కౌలురు,మద్దూరు, కొత్తూరు,నెర్వాడ, బలపనురు, ఆలమూరు,గొరుకల్లు, తమ్మరాజుపల్లె, కందికయపల్లె, పాణ్యం మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు భారీ సంఖ్యలో సామూహిక నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: