వైఎస్సార్‌ వాహన మిత్ర పధకం కింద లబ్ధిదారులకు చెక్కును పంపిణీ చేసిన...

నంద్యాలజిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

 నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద నంద్యాల జిల్లాలో 8892 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 89 లక్షల 20 వేల రూపాయలు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రముఖ్యమంత్రి విజయవాడలోని విద్యాధరపురం నుండి వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం క్రింద రాష్ట్రవ్యాప్తంగా 2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000/-  రూపాయల చొప్పున 275.93 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కారక్రమాన్ని లైవ్ ద్వారా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్,ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారుడు డీఎస్ హాబీబుల్లా,రాష్ట్ర దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృత రాజ్,జిల్లా రవాణా అధికారి శివారెడ్డి తదితరులు వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ  జిల్లాలోని ఆటో, ట్యాక్సీ, ఎండియూ ఆపరేటర్లు, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉంటూ ఇన్సూరెన్స్ వాహనాలకు అవసరమైన రిపేర్లు చేయించుకునేందుకు వైయస్సార్ వాహన మిత్ర పథకం కింద వరుసగా ఐదో ఏడాది మొత్తం 8892 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 89 లక్షల 20 వేల రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారని తెలిపారు. నియోజకవర్గాల వివరాలు తెలుపుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1194 లబ్ధిదారులకు 1,19,40,000/-, బనగానపల్లె నియోజకవర్గంలో 1074 లబ్ధిదారులకు 1,07,40,000/-,డోన్ నిజకవర్గంలో 1221 డబ్బు దారులకు 1,22,10,000/-, నందికొట్కూరు నియోజకవర్గంలో 1565 లబ్ధిదారులకు 1,56,50,000/-,


నంద్యాల నియోజకవర్గంలో 1862 లబ్ధిదారులకు 1,86,20,000/-,పాణ్యం నియోజకవర్గంలో 554 లబ్ధిదారులకు 55,40,000/-,శ్రీశైలం నియోజకవర్గంలో 1422 లబ్ధిదారులకు 1,42,20,000/-, మొత్తం 8892 మంది లబ్ధిదారులకు 8,89,20,000/- రూపాయిలు జమ చేసేమని తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి ,ఎమ్మెల్సీ ఇషాక్ బాషా లు మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హత మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరం ప్రజల రవాణా సౌకర్యాల్లో ఇబ్బందులు పడకుండా ప్రజల సౌకర్యార్థం కోసం శ్రమించే ఆటో,ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లు ఇబ్బందులు పడకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం డ్రైవర్లకు 10,000/- ఇవ్వడం హర్షించదగ్గ విషయమని, సొంత వాహనం కలిగి వున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం హర్షించదగ్గ విషయమనీ, పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమని,ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు విడతల్లో ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు 1301.89 కోట్ల రూపాయలను వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించిందని తెలిపిన అనంతరం నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి వచ్చిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు, ఎండియూ ఆపరేటర్లకు 8,89,20,000 రూపాయల మెగా చెక్కును పంపిణీ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: