గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన,,,

హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హైదరాబాద్ నగరంలో గణేష్ మండపాలలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. నిమర్జనం చివరి రోజు దగ్గరపడటంతో భక్తులు తాకిడి మరింత పెరిగింది. ఇదిలావుంటే గాంధీ బజార్లో నవ యువ గణేష్ మండపంలో ప్రతిష్టించిన గణనాధునికి హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేందర్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశోక చక్రవర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జిత్తు. ధీరజ్ దీపక్ సోని జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. 



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: