రైతన్నల శ్రేయస్సు కోరేదే వైసిపి ప్రభుత్వం

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని ఓర్వకల్లు మండలంలో ప్రభుత్వ రాయితీపై పప్పు శెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి పాణ్యం ఎమ్యెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని విత్తనాలను పంపిణీ చేశారు.అనంతరం పాణ్యంఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మీద జగనన్న చూపిస్తున్న ప్రేమ మళ్ళీ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేస్తుందని, వైయస్సార్సీపి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల మీద దివంగత నేత, ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రేమను మరువకుండా తనయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  రైతు సోదరుల మీద చూపిస్తున్నారని,


రైతు సోదరులు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిని తెలిపారు. ఈకార్యక్రమంలో ఓర్వకల్ మండల ZPTC రంగనాథ్ గౌడ్, MPP తిప్పన్న, ఓర్వకల్ సింగిల్ విండో ప్రెసిడెంట్ నాగ తిరుపాల్, వైఎస్సార్ సీపీ నాయకులు పెద్ద స్వామి, కర్నూలు డి.ఏ.ఏ.బి చైర్మన్ మహేశ్వర రెడ్డి, ఓర్వకల్లు మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ లు, వైఎస్సార్ సీపీ నాయకులు, వ్యవసాయ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: