వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
పరామర్శించిన....నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకట్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజక వర్గంలోని పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త రామాంజనేయులు గత కొన్ని రోజులుగా వైసిపి మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడు మరియు ఎస్సై బెదిరించి కేసులు పెడతామని మరియు అక్రమ కేసులు పెడుతున్నారని ఒత్తిళ్లు తాళలేక, మనస్థాపానికి గురై రామాంజనేయులు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్న విషయం తెలుసుకొన్న నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మరియు టిడిపి సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రామాంజనేయులును పరామర్శించి,
వైద్య సిబ్బందితో రామాంజనేయులు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని రామాంజనేయులు కు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మరియు టిడిపి సీనియర్ నాయకులు గౌరు వెంకట రెడ్డి వెంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండం రమణారెడ్డి,ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ జయ సూర్య, పగిడ్యాల మండలకన్వీనర్ పలుచాని మహేష్ రెడ్డి తదితరులు పరామర్శించారు.
Post A Comment:
0 comments: