కంప్యూటర్ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన,,, మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ..... నంద్యాల కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్

 కంప్యూటర్ రంగాన్ని భారతదేశానికి పరిచయం చేసిన,,,

మహోన్నత వ్యక్తి   రాజీవ్ గాంధీ

నంద్యాల కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు కాలేజీ హాస్టల్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలేసి ఘన నివాళులర్పించిన లక్ష్మీ నరసింహ యాదవ్, కార్యకర్తలు,కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆగస్టు 20 1944 జన్మించారని, అతి పిన్ని వయసులో 1984-1989 మధ్య కాలం లో ప్రధానిగా చేసిన ఘనత  రాజీవగాంధీని, రాజీవగాంధీ పూర్తి పేరు రాజీవ్ రత్న గాంధీఅని,ప్రజలకోసం  ఆలోచించి అనేక అభివృద్ధి  పధకాలను  ప్రవేశపెట్టిన ఘనత రాజీవగాంధీ గారిదని,రాజీవగాంధీ ప్రధానిగా ఉన్న సమయం లో అనేక విప్లవత్మాక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించిన మహనీయుడని,


రాజీవగాంధీ 1966 లో యూకే లో విద్యాబ్యాసం పూర్తి చేసుకుని ఇండియాలో వచ్చి  పైలట్ గా ఉద్యోగ బాధ్యతలను చేపట్టారని,తల్లి ఇందిరా గాంధీ బలవంతంవల్ల  దేశ రాజకీయాల్లోకి రావడం  జరిగిందని,సంజయ్ గాంధీ  ప్రాతినిధ్యం వహించిన అమేధీ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొంది పార్లమెంట్ లో అడుగు పెట్టారని,1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ  దారుణహత్య తరువాత రాజీవగాంధీ  ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని,1984 డిసెంబర్ లో జరిగిన  ఎన్నికలలో 411 స్థానాలు  సాధించిన అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీని.

రాజీవగాంధీ ప్రధాని అయిన తర్వాత దేశంలో టేలీకమ్యూనికేషన్స్ లో విప్లవత్మక  మార్పులు తెచ్చారని,సైన్స్ మరియు టెక్నాలజీ,ఐటీరంగం ఎంతో అభివృద్ధి  చెందిందని, గ్రామీణభివృద్ధి, కంప్యూటర్ రంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని సంకేతంగా ముందుకు తీసుకువెళ్లిన మహనీయుడని, పారిశ్రామిక రంగంలో  పన్ను తగ్గింపు విధానాన్ని అవాలంభించి,రక్షణ,విమానయన,వాణిద్య రంగాలు అభివృద్ధి చెందాయని, ఆధునిక ఆర్థిక విధానం వలన విదేశిపెట్టుబడులను  ఆకర్షించి పెట్టుబడులకు భారత్ ని స్వర్గధామం చేశాడని,1986 లో న్యూ నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టి బడుగు,బలహీనవర్గాల  అభ్యున్నతకి ఎంతగానో తొడపడిందని,నవోదయ పాఠశాలలు స్థాపించి విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారని,1987 లో బ్లాక్ బోర్డు ఆపరేషన్,1985 లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ,నవోదయ స్కూల్స్ వీటి వల్ల  గ్రామీణ  లో ఉన్న వారు  విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత కేవలం రాజీవ్ గాంధీకి మాత్రమే దక్కుతుందని, అలాంటి మహనీయుని కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేసి ఆ సంతోషాన్ని రాజీవగాంధీకి అంకితం చేయాలని లక్ష్మీ నరసింహయాదవ్ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు పఠాన్ హాబిబ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు సాంబశివుడు,రహీం,అబ్రహం,నంద్యాల పార్లమెంట్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు నాగలింగం,అమర్,రమణ, శ్రీనివాసులు,దస్తగిరి,కల్లూరు మండలం అద్యక్షులు, కల్లూరు మండల యస్సిసెల్ అధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: