నందికొట్కూరు మార్కెట్ యార్డ్ నూతన వైస్ చైర్మన్ గా..... మొల్ల షరీఫ్ బాషా బాధ్యతలు స్వీకారం

 నందికొట్కూరు మార్కెట్ యార్డ్ నూతన వైస్ చైర్మన్ గా...

మొల్ల షరీఫ్ బాషా బాధ్యతలు స్వీకారం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని స్థానిక మార్కెట్ యార్డ్ నూతన వైస్ చైర్మన్,డైరెక్టర్లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్ చైర్మన్,బంగ్లా జడ్పీటీసీ, వైసీపీ నాయకులు హాజరయ్యారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో శాఫ్ చైర్మన్, యువజన విభాగ అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని గుర్తించి జనరంజక పాలనలో భాగంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా మొల్ల షరీఫ్ భాషను ఎన్నుకోన్న పెద్దలు నమ్మకాన్ని వమ్ము చేయనని నూతనబాధ్యతలను స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు.మార్కెట్ యార్డ్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లుగా నాని సాత్విక,శివ మల్లమ్మ, మల్లెపూల శిరీష,గురులోళ్ల సరోజమ్మ,కావాటిరాముడు,పోచ కళ్యాణి,సందేపోగు దావీదు,లక్ష్మీ దేవమ్మ, అబ్దుల్ గపూర్,కేతిరెడ్డి ఆది జగదీష్ రెడ్డిలు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన మార్కెట్ వైస్ చైర్మన్ షరీఫ్ భాష మాట్లాడుతూ మార్కెట్ యార్డు నూతన చైర్మన్ గా నావంతు కృషిని తూచాతప్పకుండాపాటించి మార్కెట్ యార్డ్ విధుల పట్ల ప్రతి ఒక్కరికి సహాయ సహకారలను అందించి,  ఎలాంటి లాభపేక్ష లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని తెలిపారు.


అనంతరం మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నమ్ముకున్న కార్యకర్తలకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి న్యాయం చేస్తారని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి లక్ష్యమని తెలిపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి బైరెడ్డిసిద్దార్థరెడ్డి మరియు వ్యవసాయ శాఖ మంత్రి  కాకాని గోవర్థనరెడ్డి లకు ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో వైసిపినాయకులు జబ్బార్‌, మాజీ మార్కెట్ యార్ఢ్‌ చైర్మన్‌ తువ్వ శివరామకృష్ణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి, నందికొట్కూరు ఎంపీపీ మురళిక్రిష్ణారెడ్డి,జూపాడుబంగ్లా జడ్పీటీసీ పోచ జగదీశ్వర రెడ్డి,80 బన్నూరు సింగిల్ విండో చైర్మన్ వైవీ రమణ, నంద్యాల కర్నూలు జిల్లా వైసీపీ  నాయకులు బిసి సెల్ ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, నందికొట్కూరు మండల కన్వినర్‌ మన్సుర్,మండల వైసిపి నాయకులు మందాడి రవీంద్రరెడ్డి, శ్రీనివాసులు,ఓంకార్‌రెడ్డి, అల్లూరు పాపన్న ,కోకిల రమణా రెడ్డి,జంగంపాడు రాజు,కౌన్సిలర్ లాల్ ప్రసాద్,చట్ట మురళి, జాలంగారి నాగన్న,కాటం రమణ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: