ఖరీఫ్ పంటలు నమోదుకు సెప్టెంబర్ 15 చివరి తేదీ... 

గడివేములమండల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల యందు ఈక్రాప్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైనదని గడివేముల మండల వ్యవసాయశాఖ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్తే రైతు సోదరులు ఈక్రాప్ బుకింగ్ కొరకు అప్లికేషన్ ఫారంలో ఆధార్ కార్డు, వన్ బి, బ్యాంక్ అకౌంట్ బుక్, సంతకం, ఫోన్ నెంబర్ వేసి రైతు భరోసా కేంద్రంలోని సిబ్బందికి ఇవ్వాలని,2023 సంవత్సరం నుండి కొత్తగా జియో రిఫరెన్స్ ఆధారంగా సర్వే నెంబర్లు గుర్తించడం జరుగుతుందని, రైతు సోదరులకు సంబంధించిన ప్రతి సర్వే నెంబర్ ను పొలం దగ్గరికి తీసుకొని వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది సహాయంతో ప్రతి సెంటు పొలాన్ని కూడా నమోదు


చేసుకోవాలని,ప్రతి సర్వే నెంబరు దగ్గరికి రైతు సోదరులు పోతేనే నమోదుకు వీలవుతుందని, రైతు సోదరులు ప్రతి సర్వే నెంబర్ ను దగ్గరుండి పంట నమోదు చేసుకోవాలని, రైతన్నలు వేలిముద్ర వేసి లేదా ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్ ద్వారా ఓటిపి చెప్పి ఈకేవైసీ చేసుకోవాలని, ఖరీఫ్ పంటలు నమోదు చేసుకునే ప్రక్రియ 15-09-23 వ తేదీన ముగుస్తుందని గడివేముల వ్యవసాయ శాఖ అధికారి హేమసుందర్ రెడ్డి తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: