ప్రజా గాయకుడు... దివంగత సాయి చంద్...
సతీమణి రజినీని పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు సాయి చందు పరమపదించడం తో పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆయన సతీమణి రజనీని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా రజనీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓదార్చి , ధైర్యంగా మనోనిబ్బరంగా ఉండాలని చెప్పారు. మీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సాయి చందు సతీమణి రజినీకి మంత్రి భరోసా కల్పించారు.
Post A Comment:
0 comments: