మదమెక్కి ప్రవర్తించిన  బీజేపీ  నేతకు తగిన శాస్తి 


మదమెక్కి ప్రవర్తించిన  బీజేపీ  నేతకు తగిన శాస్తి జరిగింది. మధ్యప్రదేశ్ సీధీ జిల్లాలో ఇటీవల గిరిజన కార్మికుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లా భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ప్రభుత్వ అదేశాలతో అధికారులు అతడి ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేశారు. ప్రస్తుతం పర్వేశ్ శుక్లా రేవా సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అతడిపై పోలీసులు జాతీత భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మంగళవారం హెచ్చరించారు.  మరోవైపు, ఇల్లు కూలిపోవడం చూసి పర్వేశ్ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుమారుడి నేరానికి సాక్ష్యంగా పోలీసులు ప్రస్తావిస్తున్న వీడియో చాలా పాతదని చెప్పారు. ఎన్నికల సమీపించడంతో  రాజకీయ కారణాలతో దీన్ని బయటకు లాగారని ఆరోపించారు. అంతకుముపు, పర్వేశ్ శుక్లా తండ్రి కూడా ఈ వివాదంపై  స్పందించారు. ‘‘నా కుమారుడు ఇలాంటి పనిచేసేందుకు ఛాన్సే లేదు. అతడిపై ఏదో కుట్ర జరుగుతోంది. వీడియో చూసి మేము చాలా ఒత్తిడికి లోనయ్యాం’’ అని అన్నారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: