కన్సర్వేషన్ జోన్ నుండి,,,
మహేశ్వరం, కందుకూరు మండలాలను విముక్తి చేయండి
ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ గా ఏర్పాటు చేయండి
సీఎం కేసీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
కన్సర్వేషన్ జోన్ నుండి మహేశ్వరం, కందుకూరు మండలాలను విముక్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాసారు. ఇటీవలి మహేశ్వరం హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన మంత్రి తాజాగా లేఖ రాసారు. దినదినాభివృద్ది చెందుతున్న ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ గా ఏర్పాటు చేయాలని కోరారు.
ఇటీవలే 111 జీవో ను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరుస్తారనే నమ్మకం తమకు ఉందన్నారు. నగరానికి, ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరగా ఉన్న ఈ రెండు మండలాల్లో ప్రజల నివాసాలు గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా రెసిడెన్షియల్ జోన్ ఆవశ్యకత ఏర్పడుతుందని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు.
Home
Unlabelled
కన్సర్వేషన్ జోన్ నుండి,,, మహేశ్వరం, కందుకూరు మండలాలను విముక్తి చేయండి,,,, ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్ గా ఏర్పాటు చేయండి,,,, సీఎం కేసీఆర్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: