షాద్‌నగర్‌ పట్టణంలో ధారుణం... బైక్ పై వేగంగా వచ్చి బాలికను ఢీ కొని


రోజూలాగే స్కూల్ వెళ్లిన బాలిక సాయంత్రం స్నేహితులతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. బైక్‌పై అతివేగంగా వచ్చిన యువకులు ఆమెను ఢీకొట్టి పారిపోయారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని మల్లికార్జున కాలనీలో మంగళవారం (జూలై 4) సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

అక్కడే ఉన్న తోటి విద్యార్థులు ఆ ప్రమాదాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ప్రియా అంటూ అరుస్తూ.. విద్యార్థిని వద్దకు పరుగెత్తుకెళ్లారు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

 హైదరాబాద్ నగర శివార్లలో నిన్న (జూలై 4) ఒక్క రోజే చోటు చేసుకున్న రెండు ప్రమాదాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. మెహిదీపట్నం పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న తల్లీకుమార్తెలను చిదిమేసింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తెలు అనురాధ, మమత అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం షాద్‌నగర్‌లో వేగంగా వచ్చిన బైక్.. బాలికను ఢీకొట్టింది. రెండు ప్రమాదాల్లో వాహనాలను నడిపింది యువకులే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: