అన్ని మతాల సారం మానవత్వమే 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

అన్ని మతాల సారం మానవత్వమేనని, సర్వమతాల  మనోభాాలను బీఆర్ఎస్ సర్కార్ గౌరవిస్తోందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రాెడ్డి వెల్లడించారు. శనివారంనాడు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్  6వ వార్డు ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో  క్రైస్తవ సమాదుల తోటను ప్రారంభించిన అనంతరం ఎస్ ఎస్ ఆర్ గార్డెన్ లో జరిగిన సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు...శాంతి, కరుణ, ప్రేమ, సేవ అన్న జీసస్ బోధనలు గొప్పవని, ఈ బోధనలతో సమాజంలో శాంతి,సౌభాతృత్వం నెలకొంటుందన్నారు.. 


అన్ని మతాల సారం మానవత్వమే అని,ప్రపంచ శాంతి కోసం ప్రార్థించటం గొప్ప విషయం అన్నారు. మహేశ్వరం లో సమాధుల తోటకు  స్థలం కోసం తీవ్రంగా శ్రమించి,నేడు క్రైస్తవ సోదరుల సమాధుల తోటను ప్రారంభించుకున్నట్లు,అదే విధంగా నియోజకవర్గంలోని ఆర్ కె పురం,సరూర్ నగర్ వాసుల కోసం ఎల్ బి నగర్ లో  ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా 12 వేల గ్రామ పంచాయతీ లలో వైకుంఠ దామాలు నిర్మించి..చివరి మజిలీ ప్రశాంతంగా జరగటానికి కృషి చేసిందన్నారు.. 

క్రిస్టియన్ మైనారిటీల ఆత్మగౌరవం పెంపొందించేలా 2 ఎకరాల  స్థలంలో 10 కోట్ల రూపాయలతో ఉప్పల్ భగాయత్ క్రిస్టియన్ భవనం నిర్మిస్తున్నారన్నారు.మహేశ్వరం నియోజకవర్గంలో కూడా క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.క్రిస్టియన్ నిరుద్యోగులకు డ్రైవర్ కమ్ ఓనర్  పథకం కింద   కార్ల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20 లక్షల రూపాయలు ప్రభుత్వం  అందిస్తుందన్నారు.


  క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో కృషి చేస్తోందని. క్రిస్టియన్లందరూ గుర్తించి కేసిఆర్ గారికి మద్దతుగా నిలవాలన్నారు. అన్నీ మతాలను సమానంగా గౌరవిస్తూ ముందుకువెళ్తున్న  ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.క్రిస్మస్ పండగ సందర్భంగా విందు ఏర్పాటు చేసి,క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్  గిఫ్టులు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందనన్నారు.  ఈ కార్యక్రమంలో  యువ నాయకులు కార్తీక్ రెడ్డి,  పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,  ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

ధోభీ ఘాట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి


మహేశ్వరం మండలం కేసీ తండాలో  రజక సోదరులకు ఎకరా భూమిలో నిర్మించే ధోభీ ఘాట్ నిర్మాణ పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూమి పూజ చేశారు. 



Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: