అట్టహాసంగా ప్రారంభమైన.....మొహరం వేడుకలు
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేములలో మొహరం పండుగ వేడుకలను గడివేముల గ్రామానికి చెందిన సాదయ్య కుమారులు రామ గోవిందయ్య, రామాచారి మరియు గ్రామంలోని ఆచారుల కుటుంబ సభ్యుల సమేతంగా అత్యంత భక్తి భావంతో పూజించే హసేన్ మరియు హుస్సేన్ పీర్లకు మేళ్ళ తాళాల మధ్య పూల సూచికలను అత్యంత భక్తి భావంతో సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా పీర్ల చావడి నిర్వాహకులు రహంతుల్లా మాట్లాడుతూ ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకునే మొహరం పండుగను కుల, మతాలకు ఆతీతంగా సోదరభావంతో హిందువులు మరియు ముస్లింలు ఎంతో పవిత్రంగా,భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని, గడివేముల గ్రామంలోని ప్రజలందరూ ఐకమత్యంతో ప్రజలందరం అన్నదమ్ములలా కలిసిమెలిసి జరుపుకునేందుకు సహకరించాలని మనవి చేశారు.
Home
Unlabelled
అట్టహాసంగా ప్రారంభమైన.....మొహరం వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: