బిఆర్ఎస్ నేత పెండ్యాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో...

ఘనంగా కేటీఆర్ జన్మదినోత్సవం

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చార్మినార్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటెస్టెడ్ కార్పొరేటర్ పెండ్యాల లక్ష్మణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెండ్యాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో చార్మినార్ వద్దభాగ్యలక్ష్మి ఆలయంలో ఈరోజు ఉదయం కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చార్మినార్ వద్ద కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు జరుపుకున్నారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ పుస్తే శ్రీకాంత్, బిఆర్ఎస్ నాయకులు కే సుదర్శన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అనూష గోపి గౌడ్, దిగంబర్ బాసి తల్లి రాజేష్ ప్రణయ్ కుమార్ , అమిత్ అగర్వాల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.



 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: