కావలి పట్టణంలో నారా లోకేశ్ యువగళం

బహిరంగ సభకు పోటెత్తిన ప్రజానీకం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కావలి పట్టణంలో ప్రవేశించింది. 153వ రోజు కావలి పట్టణంలో యువగళం పాదయాత్రకు కావలిలో జనం పోటెత్తారు. భారీగా తరలివచ్చిన ప్రజలతో పట్టణ వీధులన్నీ జనప్రవాహంగా మారి కిటకిటలాడాయి. 

కావలి బీపీఎస్ సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సభలో లోకేశ్ వాడీవేడిగా, తనదైన శైలిలో ఛలోక్తులు, చమత్కారాలతో ప్రసంగించారు.

నెల్లూరు జిల్లాలో యువగళం ప్రభంజనం

నెల్లూరు జిల్లాలో యువగళం ఒక ప్రభంజనం. జగన్ జెండా పీకేయడం ఖాయం. కావలిలో మాస్ జాతర అదిరిపోయింది. పోరాటాల గడ్డ కావలి. రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నివసించిన నేల కావలి. బిట్రగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి కావలి. ఎంతో ఘన చరిత్ర ఉన్న కావలి నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

జగన్ పనై పోయింది... ఎవర్ని చూసినా భయపడుతున్నాడు!

ఈ మధ్య జగన్ మాటలు విన్నారా? భయంతో మాట్లాడుతున్నాడు, జగన్ పనైపోయింది . యువగళం జగన్ కి భయాన్ని పరిచయం చేసింది. ఆఖరికి అమ్మని చూసినా, చెల్లిని చూసినా జగన్ కి భయంతో వణికిపోతున్నాడు. జగన్ ఈ మధ్య పదే పదే నేను మీ బిడ్డని అంటున్నాడు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆస్తి మొత్తం లాగేసి కన్న తల్లిని, చెల్లిని గెంటేశాడు. అయినా ఆస్తి మీద ఆశ చావలేదు. ఇంకో ఛాన్స్ ఇస్తే నేను మీ బిడ్డనే కదా అని మీ ఇళ్లు, పొలాలు, ఆస్తులు రాసివ్వండి అని లాక్కుంటాడు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: