ఆర్ కె పురం డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు

శంకుస్థాపన చేసిన  మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్  న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మహేశ్వరం నియోజకవర్గం ఆర్ కె పురం డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్ టిఆర్ నగర్ విష్ణుమూర్తి లైన్ లో 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించే స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు, జనప్రియ గార్డెన్ కమ్యూనిటీ హాల్ లో 22 లక్షల 65 వేల రూపాయలతో చేపట్టిన పనుల ప్రారంభోత్సవం చేశారు, సరోజిని పార్క్ లో సీసీ కెమెరాలను ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.....ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతంలో నూతనంగా వచ్చిన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, లింక్ రోడ్లతో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.














Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: