దైవ భక్తికి,  త్యాగానికి, సేవ నిరతికి ప్రతీక బక్రీద్ పండుగ

ముసిం సోదరులకు,,,బక్రీద్ (ఈదుల్ అజ్ హా) పండుగ శుభాకాంక్షలు

సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ మంత్రి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

దైవ భక్తికి,  త్యాగానికి, సేవ నిరతికి బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం నాడు జరుపుకునే బక్రీద్ (ఈదుల్ అజ్ హా) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ  భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం,సేవ అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ,అందరి మత విశ్వాసాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ పాలన చేస్తున్నారని అన్నారు. గంగ జమున తహజీబ్ తో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ముఖ్యమంత్రి అభిమతమని  అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు.  అల్లా దయ అందరిపై  ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, బక్రీద్ ను ఘనంగా కుటుంభ సభ్యుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: