ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికిన,,,

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. చంఢీయాగం,వేద పండితుల మంత్రోచ్ఛారణాల మధ్య సోమవారం ఉదయం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కె.కేశవరావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు, రంజిత్ రెడ్డి,  పసునూరి దయాకర్, కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పీ.రాములు తో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. 


కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భానుప్రకాష్ రావు , దండె విఠల్,  జల వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వీ.ప్రకాష్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్,  శుభప్రద పటేల్, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ.  యువ నాయకులు కార్తీక్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఆంజనేయులు గౌడ్, శ్రీధర్ రెడ్డి,  గెల్లు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.  15 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనంలో అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ,  శిక్షణ, పరిశోధన కేంద్రం,  అతిథుల కోసం విశ్రాంతి గదులు, క్యాంటీన్ ఉండనున్నట్లు తెలిసింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: