హైదరాబాద్‌కు తర్వలోనే ఔటర్ రింగ్ రైలు,,,వాటివల్ల ఉపయోగాలెన్నో

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భద్రతా ప్రమాణాలు, మెరుగైనా రవాణా సదుపాయాలు కల్పిస్తూ.. ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటోంది. ఈ క్రమంలోనే దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు వస్తున్నారు. అంతేకాదు విదేశాల నుంచి పెట్టుపడులు వెల్లువలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటికే హైదరాబాద్ జనాభా కోటి దాటినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. గతంలో కంటే ఇప్పుడు నగరం నలువైపులా సుమారు వంద కిలోమీటర్ల మేర విస్తరించింది. అయితే.. నగరానికి మెట్రో వచ్చాక ప్రజా రవాణా తీరే మారిపోయింది. అందుకు ప్యార్‌లల్‌గా రైల్వే, ఆర్టీసీ సేవలను కూడా విస్తరించినట్టయితే.. హైదరాబాద్ విశ్వనగరంగా మారటం ఎవ్వరూ ఆపలేరు.

ఇదిలావుంటే అందులో భాగంగానే ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రారంభమైంది. మరోవైపు.. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కూడా పునర్నిర్మితమవుతోంది. ఇదంతా ఒకఎత్తయితే.. తాజాగా హైదరాబాద్‌లో సుమారు 26 వేల కోట్లతో ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్టు చేపట్టనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించటం విశేషం. అందుకు రైల్వేశాఖ సన్నాహాలు కూడా ప్రారంభించినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఈ ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు గనకా అందుబాటులోకి వస్తే.. నగరంలోకి దూర ప్రాంత రైళ్ల రాక తగ్గి.. ఎంఎంటీఎస్‌ రైళ్ల పరుగులు ఊపందుకుంటాయని నిపుణులు చెప్తున్నారు.. 5 నుంచి 10 నిమిషాలకు ఒక రైలు పట్టాల మీద పరుగులు పెట్టే అవకాశముంటుందని చెప్తున్నారు.

అయితే.. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ సెకండ్ ఫేస్‌ను ఏప్రిల్‌ 8న పీఎం మోదీ స్టార్ట్ చేశారు. ఇప్పటికే నగరంలో 95 కిలోమీటర్ల మేర విస్తరించిన ఎంఎంటీఎస్‌.. రెండో దశ పనులు 2024 జనవరికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే.. కొత్తగా వస్తున్న ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్టుతో ఎంఎంటీఎస్‌ రెండో దశ మరింత విస్తరించేందుకు అవకాశం ఉన్నట్టు విశ్లేషిస్తున్నారు. ఘట్‌కేసర్‌ తర్వాత యాదాద్రి, జనగామ, మేడ్చల్‌ తర్వాత మనోహరాబాద్‌, తూప్రాన్‌, తెల్లాపూర్‌ తర్వాత రావులపల్లి, వికారాబాద్‌, ఉందానగర్‌ తర్వాత షాద్‌నగర్‌, జడ్చర్ల వరకు.. ఎంఎంటీఎస్‌ సేవలను పొడిగించాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రజల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. కాగా.. ఒకవేళ ఔటర్‌ రింగు రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే మాత్రం ఈ విస్తరణ కూడా జరిగే ఛాన్స్ ఉంది.

అయితే.. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న అన్ని రూట్లను అనుసంధానం చేస్తూ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా అన్ని చోట్ల జంక్షన్లు నిర్మించనున్నట్టు కేంద్ర మంత్రి వివరించారు. ఇలా చేయటం వల్ల.. దూర ప్రాంతాల రైళ్లు నగరంలోకి రాకుండా శివార్లలో ఆగి.. అటు నుంచి అటే వెళ్లిపోతాయి. దీంతో.. నగరంలోని స్టేషన్లు, రైల్వే లైన్లు ఫ్రీ అవుతాయి. ఫలితంగా ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒక ఎంఎంటీఎస్‌ రైలు నడపేందుకు వీలు ఉంటుంది. అటు శివార్లలో ఉండే ప్రజలు నగరానికి వచ్చేందుకు.. నగరానికి వచ్చిన జనాలు తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: