గద్దర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా,,,కేఏ పాల్

ప్రజా గాయకుడు గద్దర్ ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్సెండ్ చేశామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు ఢిల్లీలో గద్దర్ ప్రకటించారని... ఆయన ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేకపోయారని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 5న ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేరారని... ఆ వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గద్దర్ తో డీల్ కుదుర్చుకున్నారని... దాంతో, గద్దర్ తమ పార్టీకి దూరమయ్యరని అన్నారు. తాను గద్దర్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన భార్య, కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు.  జనాభాలో దొరలు ఒక శాతం, కమ్మవారు 3 శాతం, రెడ్లు 5 శాతం ఉన్నారని... 90 శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అధికారాన్ని చేపట్టకూడదా? అని పాల్ ప్రశ్నించారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఒక బ్రాహ్మిణ్ అని... కాబట్టి ఆ పార్టీ బ్రాహ్మణుల పార్టీ అని చెప్పారు. షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: