లబ్దిదారులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసిన,,,
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 'వైద్య మరియు ఆరోగ్య శాఖ అధ్వర్యంలో మీర్ పేట్ కార్పొరేషన్ లోని జిల్లెల గూడ ఎస్ వై ఆర్ కన్వెన్షన్ లో జరిగిన తెలంగాణ వైద్యరోగ్య దినోత్సవములో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.
గర్భిణీ మహిళల్లో రక్త హీనత సమస్యను అధిగమించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన న్యూట్రిషన్ కిట్ల కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ప్రారంభించి, మహిళలకు మంత్రి సబితా రెడ్డి అందించారు.అదేవిధంగా ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించి,
ఆశ, ఏఎన్ఎం లకు చీరలు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, కలెక్టర్ హరీష్, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, ఆర్డీవో సూరజ్ కుమార్, జడ్పీటీసీ జంగారెడ్డి, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర రావు, తహశీల్దార్ జనార్దన్,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Home
Unlabelled
లబ్దిదారులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేసిన,,, మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: