గడ్డపారతో డోర్ పగలగొట్టి,,,బ్యాంకుకు కన్నం వేసేందుకు బాలుడి యత్నం
మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ బుడ్డోనికి ఏం అవసరమొచ్చిందో... లేదా సినిమాల ప్రభావమో.. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశాడు. దోచుకునేందుకు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకును ఆ పిల్లాడు ఎంచుకున్నాడు. మొదట ముసుగు దొంగలా వెళ్లి పరిసరాలు పరిశీలించిన ఆ పిల్లాడు.. ఆ తర్వాత మాత్రం.. దర్జాగా గడ్డపార, కర్రలు తీసుకొచ్చుకున్నాడు. అయితే. మెయిన్ డోర్ ద్వారా వస్తే అందరికీ తెలిసిపోతుందనుకున్నాడో.. లేక తీయటం తన వల్ల కాదని తలచాడో కానీ.. ప్రక్కన ఉన్న మరో డోర్ను పగలగొట్టేందుకు పూనుకున్నాడు.
గడ్డపారతో తాళం పగలగొట్టేశాడు. డోర్ తెరిచాడు. కానీ.. ఎలాంటి దొంగతనం చేయకుండా ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోయాడు. ఆ బుడ్డోడికి భయం అయ్యిందో.. లేదా లోపల డబ్బు ఎక్కడ ఉంటుందో తెలియదో.. ఇంకేదో కానీ.. మొత్తానికి ఎలాంటి దొంగతనం చేయకుండానే వెళ్లిపోయాడు. కానీ.. చోరికి తెచ్చిన గడ్డపార, కర్రలు అక్కడే వదిలేసి పోయాడు. ఇంత చేసిన పిల్లాడు.. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి.. తాను చేసే పని అందులో రికార్డవుతుందన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంక్ సిబ్బంది.. బ్యాంకు వద్దకు చేరుకొని పరిశీలించారు. చోరీకి వీలుపడకపోవడంతో వెళ్లిపోయారని ముందుగా అనుకున్నారు. అయితే.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల విజువల్స్ చూస్తే అసలు విషయం బయటపడింది. అయితే.. బాలుడు రాత్రి 8.20 గంటలకు తాళం పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే.. బ్యాంకులో ఉన్న నగదు, బంగారం భద్రంగా ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే.. ఆ పిల్లాడు.. నిజంగానే బ్యాంకు దోచుకునే ఉద్దేశంతోనే వచ్చాడా.. లేదా సరదాకు చేశాడా.. ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. అందుకు చెప్పుకోవాల్సిన ఉదహరణలు కోకొల్లలు. టెక్నాలజీ పెరిగిపోతున్న ప్రపంచంలో అబ్బురపరిచే నాలెడ్జితో కొందరు, చిన్నవయసులోనే గ్రాస్పింగ్ పవర్తో మరికొందరు, యునిక్ టాలెంట్తో ఇంకొందరు ఇలా ఎవరికివారే సాటి అనేలా.. పిల్లలు హ్యాట్సాఫ్ చెప్పించుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. అటు క్రైంలలో కూడా పిల్లలు తామేమి తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. అందుకు సాక్ష్యమే.. మొన్నీ మధ్య జరిగిన హైదరాబాద్ కిడ్నాప్ కేసులో ఎవరికీ అనుమానం రాకుండా ఓ బాలుడు కథ నడిపించటమే. ఆ ఘటనలో అంటే.. పెద్ద వాళ్లు కూడా తోడున్నారు ఏదో వాళ్లు చెప్పింది చేసాడు అనుకుందాం. కానీ ఇక్కడ మాత్రం మరో పిల్లాడు మాత్రం తాన వయసుకు మించిన పని చేసి అందరినీ షాక్కు గురి చేశాడు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ఓ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఆ బుడ్డోనికి ఏం అవసరమొచ్చిందో... లేదా సినిమాల ప్రభావమో.. ఏకంగా బ్యాంకునే కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశాడు. దోచుకునేందుకు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకును ఆ పిల్లాడు ఎంచుకున్నాడు. మొదట ముసుగు దొంగలా వెళ్లి పరిసరాలు పరిశీలించిన ఆ పిల్లాడు.. ఆ తర్వాత మాత్రం.. దర్జాగా గడ్డపార, కర్రలు తీసుకొచ్చుకున్నాడు. అయితే. మెయిన్ డోర్ ద్వారా వస్తే అందరికీ తెలిసిపోతుందనుకున్నాడో.. లేక తీయటం తన వల్ల కాదని తలచాడో కానీ.. ప్రక్కన ఉన్న మరో డోర్ను పగలగొట్టేందుకు పూనుకున్నాడు.
గడ్డపారతో తాళం పగలగొట్టేశాడు. డోర్ తెరిచాడు. కానీ.. ఎలాంటి దొంగతనం చేయకుండా ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోయాడు. ఆ బుడ్డోడికి భయం అయ్యిందో.. లేదా లోపల డబ్బు ఎక్కడ ఉంటుందో తెలియదో.. ఇంకేదో కానీ.. మొత్తానికి ఎలాంటి దొంగతనం చేయకుండానే వెళ్లిపోయాడు. కానీ.. చోరికి తెచ్చిన గడ్డపార, కర్రలు అక్కడే వదిలేసి పోయాడు. ఇంత చేసిన పిల్లాడు.. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి.. తాను చేసే పని అందులో రికార్డవుతుందన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు, బ్యాంక్ సిబ్బంది.. బ్యాంకు వద్దకు చేరుకొని పరిశీలించారు. చోరీకి వీలుపడకపోవడంతో వెళ్లిపోయారని ముందుగా అనుకున్నారు. అయితే.. అక్కడే ఉన్న సీసీ కెమెరాల విజువల్స్ చూస్తే అసలు విషయం బయటపడింది. అయితే.. బాలుడు రాత్రి 8.20 గంటలకు తాళం పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అయితే.. బ్యాంకులో ఉన్న నగదు, బంగారం భద్రంగా ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే.. ఆ పిల్లాడు.. నిజంగానే బ్యాంకు దోచుకునే ఉద్దేశంతోనే వచ్చాడా.. లేదా సరదాకు చేశాడా.. ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు.
Home
Unlabelled
గడ్డపారతో డోర్ పగలగొట్టి,,,బ్యాంకుకు కన్నం వేసేందుకు బాలుడి యత్నం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: