జల్ పల్లి మునిసిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ.....
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
జల్ పల్లి మునిసిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ.....పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. జల్ పల్లి మున్సిపాలిటీ 16వ వార్డులో 50 లక్షలరూపాయల తో సిసి రోడ్ల నిర్మాణం,17 వ వార్డులో 39 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం,16వ వార్డులో 30 లక్షలతో సీసీ రోడ్డు, బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన,15 లక్షలతో జల్ పల్లి అర్బన్ ఫారెస్ట్ లో చిల్డ్రన్ పార్క్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. 16 వార్డు జల్ పల్లి లో మన ఊరు మన బడి కింద 46 లక్షల నిధులతో తీర్చిదిద్దిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్ మునిసిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో మహేశ్వరం నియోజకవర్గ కార్పొరేషన్లు, మునిసిపాలిటీ లలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవలి మహేశ్వరం పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు కార్పొరేషన్లకు 50 కోట్ల చొప్పున 100 కోట్లు,రెండు మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున 50 కోట్ల నిధులు కేటాయిస్తూ వరాల జల్లులు కురిపించారని, వీటితో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.168 కోట్లతో పాటు,మెడికల్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
అభివృద్ధి-సంక్షేమాలు మా నినాదాలు - విధానాలని మంత్రి పేర్కొన్నారు..నాళాలు, తాగునీటి సమస్య లకు శాశ్వత పరిష్కారం కోసం 320 కోట్లతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాలుగు చోట్ల సమీకృతా మార్కెట్ లు, వైకుంఠ దామాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కోట్లాది రూపాయలతో రోడ్లు, కనీస సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 40 కోట్ల నిధులతో 10 చెరువులను సుందరికరణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
Home
Unlabelled
జల్ పల్లి మునిసిపాలిటీ అభివృద్ధికి బాటలు వేస్తూ..... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: