షాద్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్ శివార్లలోని షాద్నగర్లో బొలెరో వాహనం అదుపుతప్పి, డివైడర్ మీద నుంచి అవతలి వైపునకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన అశోక్, శంకర్; నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన రవి.. ముగ్గురూ కలిసి బక్రీద్ పండుగ నేపథ్యంలో బొలెరో వాహనంలో హైదరాబాద్కు గొర్రెలు తీసుకొచ్చారు. గొర్రెలకు ధర పలకడంతో బాగానే గిట్టుబాటైంది. గొర్రెలకు అమ్ముకొని శనివారం (జూన్ 24) ఉదయం ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గొర్రెలను విక్రయించగా సుమారు 2 లక్షల వరకూ డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ నగదును తమతో పాటే ఉంచుకొని, బొలెరో వాహనంలో ఇంటికి బయల్దేరారు. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని సోలీపూర్ వై-జంక్షన్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బీభత్సం చేసింది. డివైడర్ పైనుంచి అవతలి వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో జడ్చర్ల నుంచి హైదరాబాద్ వైపు బియ్యం లోడుతో వస్తున్న లారీని ఢీకొట్టింది. అమాంతం ఎగిరి రోడ్డు పక్కన పడిపోయింది.
ప్రమాదం దాటికి బొలెరో వాహనం నుజ్జునుజ్జయ్యింది. బొలెరో డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన రవి, శంకర్ను వాహనంలో నుంచి బయటకి లాగారు. 108 అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. షాద్నగర్ ఆస్పత్రిలో శంకర్ మృతి చెందగా.. ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా రవి మృతి చెందాడు.
బాధితుల వెంట ఉన్న లక్షా 92 వేల రూపాయల నగదు ఘటనా స్థలిలో పడిపోయింది. అంబులెన్స్ సిబ్బంది ఆ సొమ్ములను పోలీసులకు అప్పగించి కుటుంబసభ్యులకు అప్పగించాల్సిందిగా కోరారు. ప్రమాదంలో గాయపడిన యువకుల ప్రాణాలను కాపాడేందుకు వారు చేసిన ప్రయత్నం, దొరికిన డబ్బులను పోలీసులకు అప్పగించిన తీరు పట్ల స్థానికులు వారిని అభినందించారు.
మృతులను వనపర్తి జిల్లా పానగల్ మండలం తెల్లరాళ్లపల్లికి చెందిన శంకర్, మాందాపూర్కు చెందిన అశోక్, నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నార్యానాయక్ తండాకు చెందిన రవిగా గుర్తించారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Home
Unlabelled
షాద్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: