హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికిి,,,పట్టువస్త్రాల సమర్పణ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం 75వ బోనాల వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం రోజు ఆలయ కమిటీ అధ్వర్యంలో మిరాలంమండి శ్రీ మహంకాళి దేవాలయంలో, అలిజాకోట్ల శ్రీ కోట మైసమ్మ దేవాలయంలో అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ సభ్యులు చేతన్ కుమార్ సూరి, దిక్షిక సూరి, ఎం.ముఖేష్ యాదవ్ కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.




ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్, సలహాదారులు జి.రాజారత్నం, ఆవుల భారత్ ప్రకాష్, కార్యదర్శి కె.దత్తాత్రేయ, ప్రతినిదులు ఎస్.పి.క్రాంతి కుమార్, జగ్మోహన్ కపూర్, ఏ.రజత్, అజయ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా దేవాలయాల ప్రతినిదులు గాజుల అంజయ్య, జి.రాహుల్,  శ్రీధర్ యాదవ్, బాబు రావు, పి.వెంకటేష్ తదితరులు అక్కన్న మాదన్న మహంకాళి ఆలయ ప్రతినిధులకు అమ్మవారి ప్రసాదం అందచేసి సత్కరించారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: