ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం,,,నవ వరుడు మృతి

బావమరిదిని ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసేందుకు కారులో బయల్దేరగా రోడ్డు ప్రమాదం రూపంలో ఓ నవ వరుడికి చావు ఎదురైంది. కాళ్లపారాణి ఆరకముందే ఓ అమ్మాయి జీవితం ప్రశ్నార్థకమైంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ శివారు బోడుప్పల్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుపల్ల్ కేశవనగర్‌లోని ఎస్వీ బృందావన్‌ కాలనీకి చెందిన మురళీధర్, సుచరిత దంపతులు ప్రైవేటు లెక్చరర్లుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు చిరు హర్షిద్ (26) సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హర్షిద్‌కు గత నెల 10న ఓ అమ్మాయితో ఘనంగా పెళ్లి నిర్వహించారు. ఈ వివాహానికి ఫారెన్‌లో ఉంటున్న బంధువులు కూడా వచ్చారు.

అయితే పెళ్లి కార్యక్రమం ముగియటంతో విదేశాల నుంచి పెళ్లికి వచ్చిన హర్షిద్ బావమరిది తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యాడు. అతడు మంగళవారం రాత్రికి విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈక్రమంలో తన బావమరిదిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దించేందుకు మంగళవారం సాయంత్రం వారు ఇంటినుంచి కారులో ఎయిర్‌పోర్టుకు బయల్దేరారు. చిరు హర్షిద్‌ డ్రైవింగ్‌ చేస్తుడంగా.. బావమరిది పక్క సీట్లో కూర్చుకున్నాడు.

సుమారు ఏడు ఏడు గంటల సమయంలో కారు బొంగుళూరు దాటి రావిర్యాల వద్దకు చేరుకుంది. అక్కడకు రాగానే వీరి కారుకు ముందున్న మరో కారు డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలో ఆ కారును తప్పించబోయి హర్షిద్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభానికి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వరుడు హర్షిద్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఎయిర్‌ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పక్క సీట్లో కూర్చున్న అతని బావమరిది స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లైన నెల రోజులకే నవ వరుడు మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. నవ వధువు జీవితం ప్రశ్నార్థకంగా మారింది.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: