మందుల తయారీ పేరుతో రూ. 45 కోట్లు స్వాహా,,హైదరాబాద్లో భారీ మోసం
అమాయకులను, అత్యాశపరులను లక్ష్యంగా చేసుకొని కొందరు కేటుగాళ్లు దోపిడీలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలతో పాటు రకరకాల మోసాలతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా.. ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ కేటుగాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 45 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. వివిధ రకాల వ్యాధులను నయం చేసే మందులను తయారు చేస్తామంటూ వ్యాపారిని బురిడీ కొట్టించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన చంద్రశేఖర శాస్త్రి అనే వ్యక్తి టోటల్ క్లారిటీ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. అతడికి హైదరాబాద్కు చెందిన కందుల మహేష్ సిలిక్స్ బయో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. చంద్రశేఖర్కు మహేశ్ మధ్య ఓ సందర్భంలో పరిచయం ఏర్పడింది. చంద్రశేఖర్ వద్ద ఉన్న డబ్బుపై ఆశ పుట్టిన మహేష్ అతడిని మోసం చేయాలని పథకం రచించాడు. వ్యాధులను కొన్ని నెలల్లోనే నయం చేసే వివిధ రకాల మందులను తయారు చేస్తానని, అయితే నిధుల కొరత వచ్చిందని అందుకు తనకు సహాయం చేయాలంటూ చంద్రశేఖర శాస్త్రిని మహేశ్ బుట్టలో వేసుకున్నాడు.
అతని మాటలు నిజమని నమ్మిన చంద్రశేఖర శాస్త్రి.. మహేష్ చెప్పిన డీల్కు ఒప్పుకున్నాడు. దీంతో 2018లో ఈ ఇద్దరు వ్యాపారుల మధ్య రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం చంద్రశేఖర శాస్త్రి రూ. 45 కోట్లు మహేష్కు ఇచ్చాడు. ఆ తర్వా మహేష్ మందులు తయారు చేస్తున్నట్లు అతడిని నమ్మించాడు. చాలా రోజులైనా మందులు తయారు చేసి ఇవ్వకపోగా.. మహేష్ తీరులో మార్పు రావటాన్ని చంద్రశేఖర్ గమనించాడు. దీంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. దీంతో మహేష్ అతడికి రూ.2.50 కోట్లు తిరిగి చెల్లించాడు. మిగతా డబ్బు ఇవ్వాలని చంద్రశేకర్ కోరగా.. రేపు మాపు అంటూ మహేష్ మాట దాటవేస్తున్నాడు. ఏళ్లు గడుస్తున్నా.. డబ్బు తిరిగి ఇవ్వకపోవటంతో మోసపోయానని గ్రహించిన చంద్రశేఖర్ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
క్రెడిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో రూ.20 వేలకు టోకరా
మరో ఘటనలో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టులకు రేటింగ్ ఇస్తే డబ్బులు సంపాదించొచ్చునని సైబర్ కేటుగాళ్లు ఓ సాప్ట్వేర్ ఉద్యోగికి గాలం వేశారు. వారి మాటలు నమ్మిన సదరు సాప్ట్వేర్ ఏకంగా కోటి రూపాయల పైచిలుకు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. వీరం చెరువు ప్రాంతానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. రేటింగ్ రివ్యూల ద్వారా ఇంట్లోనే ఉంటూ పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు అంటూ ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్కు ఓ ఒక సందేశం వచ్చింది. రేటింగ్ రివ్యూల ద్వారా ఇంట్లోనే ఉంటూ పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చును అంటూ అందులో ఉంది.
అది నమ్మిన సాప్ట్వేర్ ఉద్యోగిని వారు చెప్పినట్లు చేసింది. ఆ తర్వాత.. కొన్ని టాస్కులు ఇచ్చి వాటిని కంప్లీట్ చేయటంతో కొంత డబ్బును ఆమె ఖాతాకు జమ చేశారు. కొత్త టాస్కులు ఇవ్వాలంటే కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని ఆమెను నమ్మించారు. తొలుత రూ. 1000 ఆ తర్వాత, రూ. లక్ష ఇలా మే 7 నుంచి జూన్ 8 వరకు పలు ధపాలుగా ఆమె వద్ద నుంచి రూ. 1.10 కోట్లు కొట్టేశారు. వారు చెప్పిన టాస్కులు పూర్తి చేసినా.. డబ్బులు డ్రా కాకపోవటంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఇలా బాగా చదువుకున్న వారు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవటం కలవరపాటుకు గురి చేస్తుంది.
Home
Unlabelled
మందుల తయారీ పేరుతో రూ. 45 కోట్లు స్వాహా,,హైదరాబాద్లో భారీ మోసం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: