వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచిన కేసీఆర్,,,మొత్తం రూ. 4116 పెన్షన్

దివ్యాంగుల పెన్షన్ మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్ 3 వేల 116 రూపాయలు ఉండగా.. మరో వెయ్యి పెంచి.. మొత్తంగా 4 వేల 116 రూపాయలు ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. మంచిర్యాలలో నిర్వహించి బీఆర్‌ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలోనే.. ఈ శుభవార్తను సీఎం కేసీఆర్ వినిపించారు. అయితే.. ఈ పెంచిన పెన్షన్‌ను వచ్చే నెల నుంచి ఇవ్వనున్నారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలో 5 లక్షల 16 వేల మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు.

బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో అన్ని వర్గాలు బాగుండాలని ఆకాంక్షించారు. ముస‌ల‌మ్మ‌లు, తాత‌లు ఆస‌రా పెన్ష‌న్ల‌తో నిమ్మలంగా ఉన్నారని తెలిపారు. కాగా.. దివ్యాంగులకు కూడా రూ. 3,116 పించన్ ఇస్తున్నామని తెలిపిన కేసీఆర్... ఈరోజు మంచిరోజని.. మరోవైపు తెలంగాణ ద‌శాబ్ది ఉత్స‌వాలు కూడా జ‌రుగుతున్న వేళ.. మంచిర్యాల గ‌డ్డ నుంచి ఓ మంచి ప్రకటన చేస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగుల పింఛన్‌ మ‌రో వెయ్యి రూపాయాలు పెంచుతున్నామని.. పెంచిన పింఛన్ వ‌చ్చే నెల నుంచి అందుతుందని చెప్పుకొచ్చారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: