పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు
సంక్షేమంలో, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందిరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని, అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రభుత్వం సూచించిన క్యాలెండర్ ప్రకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్టం సాధించి అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సాధించిన ప్రగతిని పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ....పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకొందాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలోనే ఎన్నో అద్భుతాలు సృష్టించింది, సంక్షేమంలో, అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగింది తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదు...కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉండదు, ఉత్సవాల్లో పోడు పట్టాలు, గొర్రెల పంపిణీ, న్యూట్రిషన్ కిట్లు, హరిత హరం ప్రారంభంతో పాటుగా కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు అందించే కార్యక్రమం చేపడుతున్నాం.
జూన్ 2 నాడు అమర వీరుల త్యాగాలను గుర్తు చేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ప్రారంభం అయ్యే ఉత్సవాలు జూన్ 22 అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్తూపం అవిష్కరణతో ముగిస్తున్నట్లు తెలిపారు. 20 రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలి. తెలంగాణ ప్రగతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా వెలుగెత్తి చాటాలి. రాష్ట్రం రాక ముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని, రైతు వేదికల వద్ద ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి భోజనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కోసం జరుగుతున్న కృషిని,మన ఊరు మన బడి కింద పాఠశాలల్లో వచ్చిన మార్పును నాడు-నేడు ఫొటోలతో ప్రదర్శించాలి. వివిధ చోట్ల వచ్చిన ప్రభుత్వ డిగ్రీ, ఇతర కళాశాలలు, గురుకుల, సంక్షేమ ఇతర పాఠశాలల వివరాలు తెలియజేయాలి. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించాలి. సిద్దంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభోత్సవాలు, రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల గ్రంథాలయాలు,1600 డిజిటల్ క్లాస్ రూములను ప్రారంభిస్తున్నాం. జూన్ 20 నాడు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, డ్రెస్సులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో జాతీయ స్థాయి అవార్డులు సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాలేశ్వరం లాగే పాలమూరు రంగారెడ్డి ని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి తాగు,సాగు నీరు తీసుకురావాటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. రాష్ట్రం వస్తే చీకటి అవుతుందని చెప్పిన చోట నేడు వెలుగులు చిమ్ముతూ 9 ఏళ్లలో సాధించిన ప్రగతిని గర్వాంగా చాటుకుంటు ప్రజలతో మమేకం అవుతూ ప్రచారం చేయాలన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలి.ఒక్కో గ్రామానికి అందుతున్న రైతు బంధు,రైతు భీమా,వివిధ రకాల పెన్షన్లు,షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి,చెరువుల్లో వదిలిన చేప పిల్లలు,గొర్రెల పంపిణీ అన్ని రకాల వివరాలతో గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని,అదేవిధంగా పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కింద మంజూరైన వివరాలతో పాటు అన్ని రకాల అభివృద్ధి నిధుల వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలి.
ఈ సమావేశంలో కలెక్టర్ హరీష్, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ, మూసి రివర్ ఫ్రంట్ చైర్మన్ సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, యెగ్గే మల్లేశం, దయనంద్, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీపీ, జడ్పీటీసీలు, మునిసిపల్ మేయర్లు, చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: