పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

చేసిన వాగ్దానాలను అమలు చేస్తున్నాం

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రజలకు చెప్పిన వాగ్దానాలను అమలు చేసి చూపెడుతున్నామని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సోమవారం పురానాపూల్లోపలు అభివృద్ధి పనులను ఆయన ఆ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్, శాసనసభ్యులు ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేం చెప్పిందే చేసి చూపెడుతున్నామని, కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత మజ్లీస్ పార్టీకే దక్కుతుందని ఆయన తెలిపారు. డివిజన్ లో 23 అభివృద్ధి పనులను మూడు కోట్ల మూడు లక్షల నిధులతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.


మురిగీచౌక్ నూతన మార్కెట్ నిర్మాణ పనులు, ఫ్లై ఓవర్లు వంటి పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల నిధులు తో పురాణపుల్ డివిజన్ ను అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రహమ్మత్ బాగ్, మజ్లీస్ నాయకులు అనిల్. సుధాకర్ బోటి రాజు, బాబు, రామ్ కుమార్, ,శ్రీనివాస్, ప్రభాకర్, సుధాకర్, అంజాద్, ఇ. అబ్దుల్ రహీం కాలేబ్ బిన్ మాజీద్ తదితరులు పాల్గొన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: