మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో
మహేశ్వరం నియోజకవర్గ మందిరాల అభివృద్ధికి... మరో 3 కోట్ల నిధులు మంజూరు...ఇప్పటికే 5 కోట్లు విడుదల
సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు,ప్రజలు
నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గ అతి పురాతనమైన ఆలయాలకు మహర్దశ పట్టనుంది.ఇప్పటికే నియోజకవర్గ కేంద్రంలోని శివగంగా దేవాలయం, తుక్కుగూడ మునిసిపాలిటీ ఫాబ్ సిటీ శ్రీ వెంకటేశ్వర ఆలయం,ఆర్ కె పురం డివిజన్ లోని ఖిలా మైసమ్మ దేవాలయానికి, బాలాపూర్ లో గల వేణుగోపాలస్వామి మందిరానికి జిల్లెల గూడ శ్రీ వెంకేశ్వర స్వామి గుడులకు కోటి రూపాయల చొప్పున మంజూరు అయిన విషయం తెలిసిందే.ఆయా దేవాలయాలలో మౌలిక సదుపాయాల కల్పనకు,భక్తుల సౌకర్యాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. తాజాగా మహేశ్వరం మండలం జిన్నాయిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ్మ స్వామి దేవాలయానికి కోటి రూపాయలు, గట్ పల్లి శ్రీ వీరంజనేయ స్వామి మందిరానికి కోటి రూపాయలు, ఉప్పగడ్డ తండా శ్రీ సేవాలాల్ మహరాజ్ గుడికి కోటి రూపాయల చొప్పున నిధుల విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ధూప,దీప,నైవేద్యాలు జరిగేలా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు.దేశంలోనే ఎక్కడా లేనివిధంగా యాదాద్రి టెంపుల్ ను పునర్నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.నియోజకవర్గంలోని అతి పురాతనమైన దేవాలయాల అభివృద్ధికి కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నియోజకవర్గంలోని 8 ప్రాచీన దేవాలయాల్లో కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన,ఇతర పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు,కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
Home
Unlabelled
మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో,,, మహేశ్వరం నియోజకవర్గ మందిరాల అభివృద్ధికి... మరో 3 కోట్ల నిధులు మంజూరు...ఇప్పటికే 5 కోట్లు విడుదల ,,,,సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు,ప్రజలు ,,,నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: