దళారులను నమ్మోద్దు... ఆన్ లైన్లో దారఖాస్తు చేసుకోవచ్చు

జి హెచ్ ఎం సి సర్కిల్-9 అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇర్షాద్  మొహమ్మద్

అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా బాధ్యతలు స్వీకరించిన ఇర్షాద్  మొహమ్మద్ 

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

జి హెచ్ ఎం సి సర్కిల్-9 అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా ఇర్షాద్  మొహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు.  ఇక్కడ ఏసీపీగా పనిచేసిన రాణి కూకట్ పల్లికి బదిలీ కావడం తో కూకట్ పల్లిలో ఏసీపీగా పనిచేసిన ఇర్షాద్ మొహమ్మద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇర్షాద్ మొహమ్మద్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, తాండూర్ మున్సిపాలిటీలతోపాటు హయత్ నగర్ జి హెచ్ ఎం సి కూకట్ పల్లి, జిహెచ్ ఎం సి కార్యాలయాలలో ఆయన వివిధ హోదాల్లో పని చేశారు. ఈ సందర్భంగా ఇర్షాద్  మొహమ్మద్ మాట్లాడుతూ సర్కిల్ లైన్ పరిధిలోని హిమ్మత్ పురా, దూద్ బోలి రోడ్డు వైన్డింగ్ పనులను త్వరితగతి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భవన నిర్మాణదారుల భవన నిర్మాణ అనుమతుల కోసం సర్కిల్ ప్రజలు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో దళారుల నమ్మవద్దని ఆయన కోరారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: