ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో...
చార్మినార్ వద్ద ఇఫ్తార్ విందు
హాజరైన ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
రంజాన్ మాసంను పురష్కరించుకొని చారిత్రాత్మక చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ తోపాటు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్అహ్మద్ ఖాన్, ఎంఐఎం ఎమ్మెల్సీ రియాజుల్ హసన్ ఆఫాన్దీ, డీసీపీ సాయి చైతన్యతోపాటు పలువురు పోలీస్ అధికార్లు, ఎంఐఎం కార్పోరేటర్లు హాజరయ్యారు. ఈ విందులో పెద్ద ఎత్తున్న ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇప్తార్ విందు అనంతరం ప్రార్థనలు కూడా నిర్వహించారు.
Post A Comment:
0 comments: