కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో... 

నిరుపేద బ్రతుకులలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాడు  మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ డివిజన్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సరూర్నగర్, ఆర్కే పురం డివిజన్లకు చెందిన 63 మంది లబ్ధిదారులకు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ


అహర్నిశలు నిరుపేద ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేనివిధంగా అమలు పరుస్తున్నామని గతాన్ని మర్చిపోవద్దు కష్టకాలంలో ఉన్నా సరే సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో  ఆర్కే పురం డివిజన్ కార్పొరేటర్, సరూర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షులు మహేందర్ యాదవ్, ఆర్కే పురం డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు పెండ్యాల నగేష్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బేర బాలకృష్ణ, నాయకులు లోకసాని కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: