విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్
అలాంటి నాయకుడి నాయకత్వాన్ని బలపర్చాలి
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మీర్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, అనిత రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ రైతు మార్కెట్ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్సీ రమణ, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని మన రాష్ట్రం మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలి అంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కొనియాడారు.
ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కంకణం కట్టుకున్న సబితా ఇంద్రారెడ్డి పట్టుదల కృషి అమోఘమని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని సబితా ఇంద్రా రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల పాలిట పెన్నిధిగా ఉందని రోజు ఈ ఆత్మీయ సమ్మేళనా కార్యక్రమం ద్వారా నాయకులు కార్యకర్తలు కలిసి అభివృద్ధి పై చర్చ జరిపి మరింత అభివృద్ధి చెందాలి అనుకుంటే ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు సాగాలని ఎల్ రమణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు నిమ్మల నరేందర్ గౌడ్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, సిద్దాల లావణ్య, మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు కామేష్ రెడ్డి ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పలువురు దిండు భూపేష్ గౌడ్, శ్రీను నాయక్, వేముల నరసింహ, ఇంద్రవత్ రవి నాయక్, విజయ్ సౌందర్య, రాజు విజయలక్ష్మి,, నందు, లెనిన్ నగర్ పవన్, కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు పార్టీ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: