ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో

పాతబస్తీలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు

హాజరైన ప్రముఖులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

పాతబస్తీలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దూద్ బోలిలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ భవనంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. సంఘం అధ్యక్షులు గోరేటి ఆనంద్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ వివాహ మహోత్సవ వేడుకల్లో సిద్ధాంతి లక్ష్మణమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

శ్రీరామనవమి కార్యక్రమంలో పాల్గొన్న అమ్మ చానల్ సీనియర్ రిపోర్టర్ కృష్ణమూర్తి


ఈ కార్యక్రమంలో పురాణా పూలు కార్పొరేటర్ సున్నం రాజమోహన్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఏసిపి రుద్ర భాస్కర్, మాజీ ఏసిపి అశోక చక్రవర్తి, టిఆర్ఎస్ హైదరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ పుస్తె శ్రీకాంత్, టిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్, మజ్లీస్ పార్టీ నాయకులు రాజు, యువజన విభాగం నాయకుడు దీపేష్ కుమార్ లతోపాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు మహిళా మండలి సభ్యులు వాసవి భవనం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .







Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: