భగవంతుని సేవలో భక్తులు, భక్తులసేవలో....

గడివేముల రెడ్ క్రాస్ సభ్యులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి) 

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామంలో వెలిసి దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని గడివేముల మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు తహసిల్దార్ శ్రీనివాసులు గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా తాహసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ శనివారము,ఆదివారము, సోమవారము సుదూర ప్రాంతాల నుండి శ్రీ దుర్గ భోగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రజల ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకుని రెడ్ క్రాస్ సభ్యులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నారని,


దర్శించుకోవడానికి వచ్చిన భక్తులలోని వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యంతో దర్శనం కల్పించడం ఎంతో సంతోషించదగ్గ విషయమని,ఈ అవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సెక్రెటరీ మమతా రెడ్డి,నాగేశ్వర్ రెడ్డి,గడివేముల రెడ్ క్రాస్ సభ్యులు వివి కృష్ణయ్య, శ్రీధర్ బాబు,లింగమయ్య, సుబ్బరాయుడు, వేణుగోపాల్,రాజు మరియు రెడ్ క్రాస్ వాలంటీర్లు  తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: