జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగస్వాములు కండి
గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండలం లోని స్థానిక గడివేముల లోని గ్రంథాలయంలో 14 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు "55" వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, 14 వ తేదీన బాలల దినోత్సవం, 15 వ తేదీన పుస్తక ప్రదర్శన, 16 వ తేదీన గ్రంథాలయ స్థాపనకు ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులను స్మరించడం, 17 వ తేదీన కవి సమ్మేళనాలు, సెమినార్లు, 18 వ తేదీన పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, 19 వ తేదీన మహిళా దినోత్సవం, 20 వ తేదీన గ్రంధాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం ఉంటుందని, గ్రంథాలయ పాఠకులు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గడివేముల గ్రంథాలయాధికారి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.
Home
Unlabelled
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగస్వాములు కండి ,,, గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: