విద్యారంగ,,,నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం

ఏఐఎస్ఎఫ్... ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

విద్యారంగంలో నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని,ప్రతి సంవత్సరం మోడీ ప్రభుత్వం ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు కల్పించాలని, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని,విభజన సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్... ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో 25,26, వ తేదీన ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ మార్చ్ లో పాల్గొనడానికి బయలు దేరిన ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు, ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ధనుంజయుడు,ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి నంద్యాల జిల్లా కార్యదర్శి శివయ్య


అర్లగడ్డ సిపిఐ మండల కార్యదర్శి భాస్కర్ ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎర్రిస్వామి,బనగానపల్లె ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పవన్ కళ్యాణ్, ఏఐఎస్ఎఫ్ నంద్యాల పట్టణ ఆర్గనైజింగ్ కార్యదర్శి మనోహర్, ఏఐఎస్ఎఫ్నా యకులు లోకేష్, ఏఐవైఎఫ్ నంద్యాల  పట్టణ ఉపాధ్యక్షుడు శశి,నాయకులు పరమేష్ తదితరులు ఢిల్లీ పార్లమెంట్ మార్చు లో పాల్గొనడానికి  బయలుదేరి వెళ్లారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: