"జగన్ హఠావో-బుర్కా బచావో" అనే నినాదాలతో
నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించిన. టిడిపి మైనార్టీ సెల్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు "జగన్ హటావో- బుర్కా బచావో" అనే నినాదాలతో తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వివరాలలోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు ముస్లిం మైనారిటీల మహిళల కు నల్ల బుర్కాలు మరియు నల్ల చున్నీలు తొలగించి సభా ప్రాంగణంలోకి పంపించారని, ముమ్మాటికి మైనారిటీ మహిళలకు మరియు యావత్తు మహిళాలోకానికి జరిగిన అవమానమని,ఈ విషయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఎస్ ఏ ఫరూక్,నంద్యాల పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కరిముల్లా, నంద్యాల టిడిపి అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, ముస్లిం మైనార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: